కరోనా వైరస్ దెబ్బకే ఇంకా ప్రపంచం బయటపడలేదు. కరోనా వైరస్ ను మించిన ప్రమాదకరమైన వైరస్ ఖోస్టా-2 ను అమెరికా శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. ఈ వైరస్ ను గబ్బిల్లాల్లో శాస్త్రవేత్తలు గుర్తించారు. కొత్త వైరస్ గబ్బిలాల నుండి మనుషులకు చాలా తేలిగ్గా సోకుతుందని గుర్తించారు.
2020లోనే మొదటిసారి రష్యాలోని గబ్బిలాల్లో ఇలాంటి వైరస్ ను కనుక్కున్నారట. అయితే అప్పట్లో ఈ వైరస్ వల్ల జనాలకు ఇంతస్ధాయిలో ప్రమాదం ఉంటుందని శాస్త్రజ్ఞులు తెలుసుకోలేకపోయారు.మనుషుల కణజాలంపైన ఖోస్టా-2 తీవ్రప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తల అధ్యయనంలో బయటపడింది. ఒమిక్రాన్ నుండి కోలుకుంటున్నవారి మీద దీని ప్రభావం మరింతగా ఉంటుందని కూడా అర్ధమవుతోంది. గబ్బిలాలు పాంగోలిన్లు రక్కూన్ కుక్కలు పామ్ సివెట్స్ వంటి జంతువుల్లో ఖోస్టా-2 వైరస్ ఉంటుందని తేలింది. తాజాగా గుర్తించిన వైరస్ వల్ల ఇన్ఫెక్షన్ వల్ల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
