గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి కేడీపేట ఎ స్ ఐ ఉపేంద్ర



 అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కేడిపేట పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న గ్రామాల్లో 18న వినాయక చవితి పర్వదినాన పురస్కరించుకొని వినాయక మండపాలు ఏర్పాటు చేసుకునే నిర్వాహకులు తప్పనిసరిగా ముందస్తు పోలీసు అనుమతి పొందాలని ఎస్ ఐ ఉపేంద్ర తెలిపారు. ఈ మేరకు మండపాల ఏర్పాటుకు కేడిపేట పోలీస్ స్టేషన్ లోని దరఖాస్తులు సమర్పిం చాలన్నారు. దరఖాస్తులను పరిశీలించిన అనంతరం అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందని, ఉత్సవాల సందర్భంగా ప్రజలకు ఇబ్బందికరమైన వాతావరణంలో నెలకొల్పిన, అసభ్యకర నృత్యాలు ప్రదర్శించిన, కమిటీ సభ్యులపై కేసులు నమోదు చేయవలసి వస్తుందని హెచ్చరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో నిమర్జనం కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్ ఐ ఉపేంద్ర తెలియజేశారు.