5000 మంది విద్యార్థులతో జాతీయ జెండాలు చేతపట్టి భారీ ర్యాలీ


చంద్రయాన్ 3 విజయవంతమైన సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలకు,భారతదేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు  ఆధ్వర్యంలో 5000 మంది విద్యార్థులతో జాతీయ జెండాలు చేతపట్టి బారీ ర్యాలీ నిర్వహించిన అవనిగడ్డ మండల విద్యా కుటుంబం.


ఎన్టీఆర్ జిల్లా :

జాతీయ జెండాలు ప్రదర్శిస్తూ జయహో భారత్ జయహో ఇస్రో అంటూ విద్యార్థులు చేసిన నినాదాలతో మారు మోగిన అవనిగడ్డ గ్రామం

ఈ సందర్భంగా అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు మాట్లాడుతూ....

చంద్రయాన్ 3 విజయం ప్రతి ఒక్క భారతీయుడు గర్వించదగ్గ విషయం అని అన్నారు.

చంద్రయాన్ 3 విజయవంతం కావటానికి కృషి చేసిన ఇస్రో శాస్త్రవేత్తలు అందరికీ అవనిగడ్డ నియోజకవర్గం ప్రజలు తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు

చంద్రయాన్ 3 విజయంతో ఒక భారతదేశంలోనే కాక ప్రపంచ దేశాల లో ఉన్న భారతీయులందరూ సంబరాలు జరుపుకుంటున్నారని అన్నారు

చంద్రయాన్ 3 విజయవంతం అవటానికి కృషి చేసిన శాస్త్రవేత్తలు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నియోజకవర్గం లోని ప్రజలందరూ కలిసి సంతకాలు చేసి పంపించడం జరుగుతుందన్నారు

ప్రపంచ దేశాలు మొత్తం భారతదేశం వైపు చూసేలా కృషిచేసిన శాస్త్రవేత్తల అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో వీరితోపాటు ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల రైతు విభాగ జోనల్ ఇంచార్జ్ నరసింహారావు , అవనిగడ్డ నియోజకవర్గ యువ నాయకులు సింహాద్రి వికాస్ బాబు , అవనిగడ్డ డిఎస్పి మురళీధర్, మండల ప్రజా ప్రతినిధులు, పలువురు అధికారులు పాల్గొన్నారు.