మన దేశంలో కొత్త వేరియంట్ ,,మొదటసారి పుట్టిందా


కరోనా..  మళ్లీ ఇప్పుడు పడగ విప్పుతోంది. మనదేశంలో
రోజూ దాదాపు లక్షకు కేసులు చేరువవుతున్నాయి. దీంతో మళ్లీ కరోనా కేసులు అందరిలో కలవరం కలిగిస్తున్నాయి. మరోవైపు తెలుగు రాష్ట్రాలు.. ఆంధ్రప్రదేశ్ తెలంగాణల్లోనూ కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. తమిళనాడులో ఒక స్కూలులో ఒక్కరోజే 31 మంది విద్యార్థులకు కరోనా సోకడం ఇది మళ్లీ విజృంభిస్తోందనడానికి నిదర్శనమని చెబుతున్నారుఈ కొత్త వేరియంట్,, మనదేశంలోనే వెలుగుచూసిందనే వార్త డేంజర్ బెల్స్ మోగిస్తోంది.. 

అందులోనూ ఈ కొత్త వేరియంట్ మనదేశంలోనే వెలుగుచూసిందనే వార్త డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ బాంబు పేల్చింది. భారత్లో కరోనా వైరస్ కొత్త వేరియంట్ పుట్టుకొచ్చినట్లు సంచలన ప్రకటన చేసింది. దీన్ని బీఏ 2.75 వేరియంట్గా నిర్ధారించినట్లు పేర్కొంది.

భారత్లో కనీసం 10 రాష్ట్రాల్లో ఈ కొత్త రకం సబ్ వేరియంట్ను గుర్తించినట్లు ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు ప్రకటించడం కలకలం రేపుతోంది. ఇండియాలో వెలుగుచూసిన ఈ కొత్త వేరియంట్ తో కలిపి ఇప్పటివరకు కరోనా సీక్వెన్సులకు సంబంధించిన 85 వేరియంట్లను గుర్తించామని అంటున్నారు.
మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ విషయంలో హెచ్చరికలు జారీ చేసింది. భారత్ వంటి దేశాల్లో బీఏ.2.75 అనే కొత్త సబ్–వేరియంట్ ప్రమాదం ఎక్కువగా ఉందని తన నివేదికలో పేర్కొంది. యూరప్–అమెరికాలో బీఏ.4 బీఏ.5 కేసులు ఉన్నాయని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ చెబుతున్నారు.

ఈ వేరియంట్ తొలిసారిగా భారత్లో కనిపించిందని తర్వాత మరో 10 దేశాల్లోనూ గుర్తించామని టెడ్రోస్ వెల్లడించారు. కాగా డబ్ల్యూహెచ్ఓ గణాంకాల ప్రకారం ప్రపంచంలో కరోనా కేసుల సంఖ్య గత రెండు వారాల్లో ఏకంగా 30 శాతం పెరిగింది. కాగా గత 24 గంటల్లో భారత్లో 18930 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్తో మరో 35 మంది మరణించారు. యాక్టివ్ కేసులు 117893కు పెరగడం గమనార్హం.