ఓవైపు కరోనా.. మరోవైపు ఒమిక్రాన్


మహారాష్ట్రలో రోజువారీ కేసులు భారీగా నమోదవ్వడం ఆ రాష్ట్రాన్ని
మరోసారి లాక్డౌన్లోకి నెట్టేలా కనిపిస్తోంది. మరోవైపు మహారాష్ట్రలో కొత్తగా రెండు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.మహారాష్ట్రలో ఇప్పుడు కూడా భారీగా కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో గత 24 గంటల్లో కొత్తగా 4335 మంది కరోనా బారినపడినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

మహమ్మారి సోకి ముగ్గురు మరణించినట్లు తెలిపింది.మహారాష్ట్రలో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 20వేల మార్కును దాటినట్లు పేర్కొంది. మహారాష్ట్రలో వరసగా రెండో రోజు 4వేలకుపైగా కేసులు నమోదైనట్లు వివరించింది. బుధవారం రోజున రాష్ట్రంలో 4024 మంది కరోనా బారిన పడినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం.. నాగ్పూర్కు చెందిన ఇద్దరు రోగులు ఒమిక్రాన్ వేరియంట్ బారినపడినట్లు తెలుస్తోంది. బాధితుల్లో ఒకరు పురుషుడు(29) మహిళ(54). వీరితో కలిపి రాష్ట్రంలో మొత్తం బీఏ4 బీఏ5 వేరియంట్ బారిన పడిన వారి సంఖ్య 19కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.మహారాష్ట్రలో మొత్తం కేసులు 7923697.. తాజా కేసులు  4255.. మరణాల సంఖ్య 147880..  కోలుకున్న వారి సంఖ్య 7755183..  క్రియాశీల కేసులు 20634 నమోదు కాగా.. ఇప్పటి వరకూ రాష్ట్రం మొత్తంగా కరోనా నిర్ధారణ పరీక్షలు 81472916.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల నమోదు తగ్గుతున్నా.. కరోనాతో మరణాల సంఖ్య గత ఐదు వారాలుగా 4 శాతం మేర పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది.