వైసీపీలో 22 మంది ఎంపీలు ఉన్నారు. వీరిలో ఒక్కరు మాత్రమే రెబల్ అవగా.. మిగిలిన 21 మంది కూడా వైసీపీ అధినేత సీఎం జగన్కు అత్యంత విధేయులుగా ఉన్నారు.వీరు కేవలం ఉత్సవ విగ్రహాలు మాదిరిగా ఉన్నారే తప్ప.. అటు కేంద్రంలోనూ.. ఇటు రాష్ట్రంలోనూ తమదైన ముద్ర మాత్రం వేయలేకపోతున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ కాకినాడ ఎంపీ వంగా గీత విశాఖ ఎంపీ సత్యనారాయణ అరకు ఎంపీ గొట్టేటి మాధవి హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కడప ఎంపీ అవినాష్ రెడ్డి చిత్తూరు ఎంపీ రెడ్డప్పల పేర్లు జోరుగా వినిపిస్తున్నాయి.
ఈ ఎంపీలందరికీ ఉన్న కామన్ మైనస్లు ఏంటంటే.. వీరు ఎవరికీ అందుబాటులో ఉండరు.పొరుగు నియోజకవర్గాల్లో వేలు పెట్టడం.. వివాదాలకు సై అనడం.. మూడేళ్లలోల మీరు ఏం చేశారు? అని ఎవరైనా ప్రశ్నిస్తే.. ఎదరు దాడి చేయడం.. ఇక మహిళా ఎంపీల విషయానికి వస్తే.. వీరు గ్రామ సర్పంచ్లకు ఎక్కువ.. అన్నట్టుగా వ్యవహరిస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. . ఎక్కడా నియోజకవర్గాల్లో అభివృద్ధి అన్నది కనిపించడం లేదు. మరోవైపు.. వచ్చే ఎన్నికలకు సంబందించి ఎక్కడికక్కడ పార్టీలు సమాయత్తం అవుతుంటే.. వీరు మాత్రం తమ సొంత అజెండాలను అమలు చేసుకునేందుకు మాత్రమే ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీంతో వీరిని మార్చాలనే డిమాండ్లు జోరుగా వినిపిస్తున్నాయి.