జనసేనాని సిద్ధాంతాలకు ఆకర్షితులై వైయస్సార్ పార్టీ నుండి పలువురి చేరిక


రాంబిల్లి మండలంలోని దిమిలి గ్రామంలో జనసేన అధినేత ప
వన్ కళ్యాణ్ ఆశయాలు మరియు పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆయన పడుతున్న తపన కౌలు రైతుల సంక్షేమం కోసం ఆయన ప్రారంభించిన కౌలు రైతుల భరోసా యాత్ర మరియు కార్యకర్తల కోసం ఆయన తీసుకువచ్చిన క్రీయాశీలక సభ్యత్వం లాంటి నిర్ణయాలునచ్చి అదేవిధంగా ప్రజల కోసం నిలబడి ప్రభుత్వాని ధైర్యంగా ప్రశ్నించే యలమంచిలి నియోజకవర్గ ఇంఛార్జ్ సుందరపు విజయ్ కుమార్ నాయకత్వం పై భరోసాతో ఆయన సమక్షంలో వైయస్సార్సీపి పార్టీకి చెందిన సుమారు 60 మంది జనసేన పార్టీ లో చేరారు.


ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాలుగు మండలాల నుంచి నాయకు
లు రాంబిల్లి మండలం జనసేన పార్టీ అధ్యక్షులు పప్పల నూకన్న దొర, రాంబిల్లి మండలం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఉరిటి నానాజీ, జనసేన పార్టీ రాంబిల్లి మండలం ఉపాధ్యక్షులు గొర్లె నాని, సుందరపు లోవరాజు, కాపు సంక్షేమ యువసేన రాంబిల్లి మండలం అధ్యక్షులు నానేపల్లి సన్యాసిరావు, అచ్యుతాపురం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కోరుకొండ ప్రసాద్, కరెడ్ల సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.