ఉక్రెయిన్లో భారత రాయబార కార్యాలయం ఖాళీ


ఏడు రోజులుగా రష్యా కీవ్ పై దండెత్తి ప్రధాన
కార్యాయాలయాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇక తరువాతి టార్గెట్ ను ఖార్కీవ్ ను ఎంచుకుంది. ఇప్పుడ  ఖర్కీవ్ ను రష్యా బలగాలు చుట్టు ముట్టి ఆధీనంలోకి తెచ్చుకుంటున్నాయి.ఉక్రెయిన్ పై రష్యా దాడి ముందుగానే పసిగట్టిన భారత్ కీవ్ లోని కార్యకాలపాలను కట్టడి చేశాయి. ఇందులో భాగంగా భారత ఎంబసీ కార్యాలయాన్ని ఖాళీ చేయించింది. ఇక కీవ్ లో నివసిస్తున్న భారతీయులు విద్యార్థులను ఖాళీ చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. యుద్ధం పతాక స్థాయికి చేరుకున్న సమయంలో భారత్ కు సంబంధించిన అధికారులు కీవ్ ను ఖాళీ చేశారు. ఇక్కడి నుంచి సురక్షితంగా ఉన్న పశ్చిమ ప్రాంతానికి వెళ్లారు. వెస్టర్న్ రీజియన్ లోని ల్వీవ్ నగరం నుంచి తమ కార్యాకలాపాలు సాగించాలని నిర్ణయించారు.

అయితే ఖార్కీవ్ లో చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చేందుకు భారత్ అప్రమత్తమైంది. ఇక్కడున్న పౌరులు విద్యార్థులను తరలించడానికి సీ-17 గ్లోబ్ మాస్టర్ ను పంపించామని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ విమానం ఢిల్లీ నుంచి ఇప్పటికే బయలుదేరింది. సీ -17 నేరుగా రొమేనియా రాజధాని బుడాపెస్ట్ కు చేరుకుంటుంది. సీ-17తో పాటు ఎయిరిండియా సహా ఇతర ప్రైవేట్ విమానయాన సంస్థలను కూడా కేంద్ర ప్రభుత్వం బరిలో ఉంచనుంది. మొత్తం 26 విమాన సర్వీసులనుు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఇక్కడి అధికారుతు తెలుపుతున్నారు.

ఇప్పటివరకు 12 వేల మంది భారతీయులు ఉక్రెయిన్ సరిహద్దులు దాటి పొరుగు దేశాలకు చేరుకున్నట్లు హర్షవర్దన్ ప్రింగ్లా తెలిపారు. అయితే ఉక్రెయిన్లో ఇంకా వేలాది మంది ఉన్నట్లు తెలుస్తోంది.   కొందరు కీవ్ఖార్కీవ్ తో పాటు సుమీ నగరాల్లో ఉన్నట్లు సమాచారం. అక్కడున్న వారందరినీ స్వదేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. మరోవైపు విద్యార్థులు కీవ్ నగరాన్ని వెంటనే వీడాలని భారత అధికారులు సూచనలు చేస్తున్నారు. ఏమాత్రం జాప్యం చేయకుండా ఏదో రకంగా ఈ నగరాన్ని విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు.