పెరూలో కుప్పకూలిన విమానం..


 ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఓ తేలికపాటి విమానం నాజ్కాలోలో టేకాఫ్‌ అయిన కొద్దిసేటికే కుప్పకూలింది.  దీంతో విమానంలో ప్రయాణిస్తోన్న ఏడుగురు ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. పెరువియన్ ఎడారిలోని నాజ్కా లైన్ల  పర్యటన కోసం సందర్శకులను తీసుకువెళ్తుండగా నాజ్కాలోని విమానాశ్రయం సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో ఐదురగురు పర్యాటకులు, పైలట్​, కో-పైలట్ ఉన్నట్లు తెలిపారు. పర్యాటకుల్లో ముగ్గురు డచ్ టూరిస్టులు కాగా ఇద్దరు చిలీకి చెందినవారు

. ఇక ప్రమాదానికి గురైన విమానం ఏరో శాంటోస్‌ అనే పర్యాటక సంస్థకు చెందిన సెస్నా 207 సింగిల్ ఇంజన్ విమానంగా అధికారులు గుర్తించారు.కాగా పెరూలోని నాజ్కా లైన్లు అనేది ప్రముఖ పర్యాటక ప్రాంతం. యునెస్కో కూడా దీనిని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఈ ఎడారిని సందర్శించడానికి నిత్యం విదేశీ పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. వీరికోసం మారియా రీచే ఎయిర్‌ ఫీల్డ్‌ నుంచి ప్రతిరోజు డజన్ల సంఖ్యలో విమానాలను నడుపుతుంటారు.

 కాగా 2010 అక్టోబర్‌లో ఇదే ప్రాంతంలో జరిగిన ఓ విమాన ప్రమాదంలో నలుగురు బ్రిటిష్‌ పర్యాటకులు, ఇద్దరు పెరూవియన్‌ విమాన సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. కాగా తేలికపాటి విమానం టేకాఫ్‌ అయిన కొద్ద సమయానికే కుప్పకూలిపోవడంపై దర్యాప్తునకు ఆదేశించింది పెరూ ప్రభుత్వం.