కరోనా పుట్టినిల్లు చైనా.. మళ్లీ లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది


కరోనా పుట్టినిల్లు చైనా.. మళ్లీ లాక్‌డౌన్‌లోకి
వెళ్లిపోయింది. పలు ప్రాంతాల్లో కరోనా వైరస్‌ విజృంభిస్తుండడంతో చైనా కఠిన ఆంక్షలకు దిగింది. మధ్య చైనా సహా షాంఘై చుట్టుప్రక్కల ప్రాంతాలతో పాటు.. పారిశ్రామిక నగరమైన చాంగ్‌చున్‌లో కరోనా కొత్త కేసులు భారీగా పెరగడంతో.. చర్యలకు దిగింది చైనా. దీంతో 3 కోట్ల మంది లాక్‌డౌన్‌లో చిక్కుకుపోయారు. 

దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నందున.. మునుపెన్నడూ లేని పరిస్థితిని డ్రాగన్‌ కంట్రీ ఎదుర్కొంటోంది. ఒక్కరోజులో 5 వేల 280 కేసులు నమోదయ్యాయి. ముందురోజుతో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో కేసులు రావడం అక్కడి అధికారులకు ఆందోళన కలిగిస్తున్నది. 2019లో వుహాన్‌లో కేసులు వెలుగు చూసినప్పటి నుంచి.. ఇప్పటిదాకా చైనాలో ఈ రేంజ్‌ కేసులు రావడం ఇదే మొదటిసారి.